‘మంచి రోజులు వచ్చాయి’ సెన్సార్ పూర్తి!
- October 27, 2021
హైదరాబాద్: సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమంటున్నారు దర్శకుడు మారుతీ.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!