‘మంచి రోజులు వచ్చాయి’ సెన్సార్ పూర్తి!
- October 27, 2021
హైదరాబాద్: సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమంటున్నారు దర్శకుడు మారుతీ.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









