నేటి నుంచే కొత్త కోవిడ్-19 ప్రోటోకాల్స్ అమలు..
- October 31, 2021
అబుధాబి: కొత్త కోవిడ్-19 ప్రోటోకాల్స్ నేటి నుంచే అమల్లోకి రానున్నాయని అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ స్పష్టం చేసింది. బిజినెస్, ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్, ఎగ్జిబిషన్ లకు సంబంధించిన అన్ని ఈవెంట్లను కొత్త నిబంధనల ప్రకారం నిర్వహించాలని పేర్కొంది. ఇవెంట్లకు హాజరయ్యే వారు కచ్చితంగా 96 గంటల్లోపు చేయించుకున్న నెటిటివ్ పీసీఆర్ పరీక్ష రిపోర్టును అల్హోస్న్ యాప్లో అప్ లోడ్ చేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్కులను ధరించాలి. వారం క్రితం నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA), జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) UAE సిటిజన్స్ కోసం కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త అప్డేట్ ప్రకారం కోవిడ్-19 వ్యాక్సిన్ల పూర్తి మోతాదులను పొందిన వారు మాత్రమే అనుమతి ఉన్న జాబితాలోని దేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం









