5 ఏళ్లు పైబడిన పిల్లలకు COVID-19 వ్యాక్సిన్.. సుప్రీం కమిటీ ఆమోదం
- October 31, 2021
ఒమన్: నవంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో 5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు COVID-19 వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సుప్రీం కమిటీ ఆమోదం తెలిపింది. నవంబర్ మొదటి వారం నుంచి వీరికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. అలాగే COVID-19 బారిన పడే అవకాశం ఉన్నవారికి మూడో డోస్ COVID-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యున్నత కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీరికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. వేలంపాటలు, ప్రీ-ఈద్ సౌక్లు, ఓపెన్ ఎయిర్ మార్కెట్ల వంటి సాంప్రదాయ మార్కెట్లను తిరిగి తెరవడానికి అనుమతించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. అదే విధంగా అందరూ విధిగా మాస్కులు ధరించడం, విక్రయ కేంద్రాల వద్ద రద్దీని నివారించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని అత్యున్నత కమిటీ నొక్కి చెప్పింది.
తాజా వార్తలు
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 90వ సమావేశం ఘన విజయం
- అమెరికా పర్యటనకు కేటీఆర్









