5 ఏళ్లు పైబడిన పిల్లలకు COVID-19 వ్యాక్సిన్.. సుప్రీం కమిటీ ఆమోదం

- October 31, 2021 , by Maagulf
5 ఏళ్లు పైబడిన పిల్లలకు COVID-19 వ్యాక్సిన్.. సుప్రీం కమిటీ ఆమోదం

ఒమన్: నవంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో 5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు COVID-19 వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సుప్రీం కమిటీ ఆమోదం తెలిపింది. నవంబర్ మొదటి వారం నుంచి వీరికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. అలాగే COVID-19 బారిన పడే అవకాశం ఉన్నవారికి మూడో డోస్ COVID-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యున్నత కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీరికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. వేలంపాటలు, ప్రీ-ఈద్ సౌక్‌లు, ఓపెన్ ఎయిర్ మార్కెట్ల వంటి సాంప్రదాయ మార్కెట్‌లను తిరిగి తెరవడానికి అనుమతించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. అదే విధంగా అందరూ విధిగా మాస్కులు ధరించడం, విక్రయ కేంద్రాల వద్ద రద్దీని నివారించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని అత్యున్నత కమిటీ నొక్కి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com