5 ఏళ్లు పైబడిన పిల్లలకు COVID-19 వ్యాక్సిన్.. సుప్రీం కమిటీ ఆమోదం
- October 31, 2021ఒమన్: నవంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో 5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు COVID-19 వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సుప్రీం కమిటీ ఆమోదం తెలిపింది. నవంబర్ మొదటి వారం నుంచి వీరికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. అలాగే COVID-19 బారిన పడే అవకాశం ఉన్నవారికి మూడో డోస్ COVID-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యున్నత కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీరికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. వేలంపాటలు, ప్రీ-ఈద్ సౌక్లు, ఓపెన్ ఎయిర్ మార్కెట్ల వంటి సాంప్రదాయ మార్కెట్లను తిరిగి తెరవడానికి అనుమతించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. అదే విధంగా అందరూ విధిగా మాస్కులు ధరించడం, విక్రయ కేంద్రాల వద్ద రద్దీని నివారించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని అత్యున్నత కమిటీ నొక్కి చెప్పింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం