పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి
- October 31, 2021బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టేడియంలో 36 గంటలకు పైగా పునీత్ భౌతికకాయం సందర్శన కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ సంఖ్యలో అభిమానుల తాకిడి ఉంది. రికార్డు స్థాయిలో 10 లక్షల మంది చివరి చూపు కోసం కంఠీరవ స్టేడియంకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. పునీత్ ను అడ్మిట్ చేసిన విక్రమ్ ఆసుపత్రి నుంచి ఖననం వరకు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.
కంఠీరవ స్టేడియం నుంచి రాజ్ కుమార్ స్టూడియో వరకు నిరాడంబరంగా అంతిమ యాత్ర కొనసాగింది. ఆ తరువాత సంప్రదాయ రీతిలో అంతిమ సంస్కారాలు జరిగాయి. కుటుంబీకులు, ముఖ్య నటులు, ప్రభుత్వ పెద్దల మధ్య పునీత్ ఖననం ప్రభుత్వ లాంఛనాలతో జరిగింది. తెల్లవారుజామున 5 నుంచి 8.00 మధ్యలో పునీత్ అంతిమయాత్ర, ఖననం పూర్తయ్యాయి. స్టూడియో వెలుపల ఇప్పటికీ వేలాది మంది అభిమానులు ఉన్నారు. తన అభిమాన నటుడికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికిన లక్షలాది మంది అభిమానులు ఇంకా ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..