ఫ్లై దుబాయ్ ప్రమాదం: 20,000 డాలర్ల ఎక్స్గ్రేషియా
- March 20, 2016
ఫ్లై దుబాయ్ సంస్థ, విమాన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 20,000 (73,500 దిర్హామ్లు) డాలర్ల చొప్పున ఎక్స్గ్రేషియాని అందించనున్నట్లు ఫ్లై దుబాయ్ వర్గాలు వెల్లడించారు. డబ్బుతో వారి ప్రాణాలకు విలువ కట్టడంలేదనీ, ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమవంతుగా ప్రయత్నిస్తున్నామని సంస్థ ప్రతినిథులు చెప్పారు. బ్లాక్ బాక్స్ మరియు ఫ్లైట్ రికార్డర్స్ని ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. మృతుల కుటుంబాల్ని గుర్తించి, వారికి తగిన సమాచారం ఇచ్చే పనిలో ఉన్నామన్నారు అధికారులు. ఐదుగురు సిబ్బంది, 55 మంది ప్రయాణీకులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!









