బూస్టర్ డోస్ కోసం అపాయింట్ మెంట్ అవసరం లేదు
- November 03, 2021
కువైట్: బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వారికి కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బూస్టర్ డోస్ కావాల్సిన వారెవరు కూడా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రెండో డోస్ తీసుకున్న తర్వాత 6 నెలలు ముగిసిన వారంతా బూస్టర్ డోస్ తీసుకోవచ్చని చెప్పారు. రిస్క్ గ్రూప్ లో ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తైన తర్వాత కూడా కరోనా ప్రమాదం ఉందని గుర్తించారు. ఇలాంటి వారి కోసం బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పెడితే వ్యాక్సినేషన్ ఆలస్యం అవుతుందని ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా బూస్టర్ డోస్ ఇవ్వాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వారు నేరుగా కువైట్ లోని మిష్రప్ వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









