యూఏఈ నేషనల్ డే కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరి
- November 03, 2021యూఏఈ: యఏఈ 50 వ జాతీయ వేడుకలు త్వరలోనే జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఐతే కరోనా ఎఫెక్ట్ ఉన్నందున అధికారులు సేప్టీ ప్రీకాషన్స్ పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరయ్యే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. నిర్వాహకులు కార్యక్రమం జరిగే చోట కచ్చితంగా కరోనా జాగ్రత్తలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటైజర్ లు, మాస్క్ లు విజిటర్స్ కు అందజేయాలని సూచించారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే చోట జాగ్రత్తలు తీసుకునే విధంగా వాలంటీర్లను నియమించాలని యూఏఈ కోరింది. అదే విధంగా డెలిగేట్స్, అధికారులు, కార్యక్రమానికి వచ్చే వారు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దన్నారు. ఇక స్థానికులు కూడా తప్పకుండా అధికారులు సూచించిన రూల్స్ ను పాటించాలని కోరారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉన్నందును కరోనా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని యూఏఈ అధికారులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారించేందుకే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన నేషనల్ డే ను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరోనా రూల్స్ పాటించి మహమ్మరిని పారదోలేందుకు అంతా సహకరించాలని యూఏఈ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్