యూఏఈ నేషనల్ డే కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరి
- November 03, 2021
యూఏఈ: యఏఈ 50 వ జాతీయ వేడుకలు త్వరలోనే జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఐతే కరోనా ఎఫెక్ట్ ఉన్నందున అధికారులు సేప్టీ ప్రీకాషన్స్ పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరయ్యే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. నిర్వాహకులు కార్యక్రమం జరిగే చోట కచ్చితంగా కరోనా జాగ్రత్తలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటైజర్ లు, మాస్క్ లు విజిటర్స్ కు అందజేయాలని సూచించారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే చోట జాగ్రత్తలు తీసుకునే విధంగా వాలంటీర్లను నియమించాలని యూఏఈ కోరింది. అదే విధంగా డెలిగేట్స్, అధికారులు, కార్యక్రమానికి వచ్చే వారు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దన్నారు. ఇక స్థానికులు కూడా తప్పకుండా అధికారులు సూచించిన రూల్స్ ను పాటించాలని కోరారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉన్నందును కరోనా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని యూఏఈ అధికారులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారించేందుకే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన నేషనల్ డే ను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరోనా రూల్స్ పాటించి మహమ్మరిని పారదోలేందుకు అంతా సహకరించాలని యూఏఈ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు