యూఏఈ నేషనల్ డే కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరి
- November 03, 2021
యూఏఈ: యఏఈ 50 వ జాతీయ వేడుకలు త్వరలోనే జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఐతే కరోనా ఎఫెక్ట్ ఉన్నందున అధికారులు సేప్టీ ప్రీకాషన్స్ పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరయ్యే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. నిర్వాహకులు కార్యక్రమం జరిగే చోట కచ్చితంగా కరోనా జాగ్రత్తలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటైజర్ లు, మాస్క్ లు విజిటర్స్ కు అందజేయాలని సూచించారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే చోట జాగ్రత్తలు తీసుకునే విధంగా వాలంటీర్లను నియమించాలని యూఏఈ కోరింది. అదే విధంగా డెలిగేట్స్, అధికారులు, కార్యక్రమానికి వచ్చే వారు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దన్నారు. ఇక స్థానికులు కూడా తప్పకుండా అధికారులు సూచించిన రూల్స్ ను పాటించాలని కోరారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉన్నందును కరోనా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని యూఏఈ అధికారులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారించేందుకే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన నేషనల్ డే ను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరోనా రూల్స్ పాటించి మహమ్మరిని పారదోలేందుకు అంతా సహకరించాలని యూఏఈ అధికారులు విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







