భారత్లో కరోనా కేసుల వివరాలు
- November 05, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,70,847 శాంపిల్స్ పరీక్షించగా.. 12,729 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో 221 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 12,165 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు కేంద్రం పేర్కొంది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.43 కోట్లను దాటేయగా.. ఇప్పటి వరకు 3.37 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 1,48,922 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,59,873కి పెరిగింది. మరోవైపు.. మరోవైపు వ్యాక్సినేషన్పై దీపావళి ప్రభావం పడింది.. నిన్న 5,65,276 మంది వ్యాక్సిన్ తీసుకోగా.. మొత్తం కరోనా టీకాల సంఖ్య 1,07,70,46,116కు చేరింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









