భారత్లో కరోనా కేసుల వివరాలు
- November 05, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,70,847 శాంపిల్స్ పరీక్షించగా.. 12,729 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో 221 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 12,165 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు కేంద్రం పేర్కొంది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.43 కోట్లను దాటేయగా.. ఇప్పటి వరకు 3.37 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 1,48,922 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,59,873కి పెరిగింది. మరోవైపు.. మరోవైపు వ్యాక్సినేషన్పై దీపావళి ప్రభావం పడింది.. నిన్న 5,65,276 మంది వ్యాక్సిన్ తీసుకోగా.. మొత్తం కరోనా టీకాల సంఖ్య 1,07,70,46,116కు చేరింది.
తాజా వార్తలు
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!







