ICC T20: స్కాట్లాండ్ పై టీం ఇండియా ఘన విజయం
- November 05, 2021
దుబాయ్: స్కాట్లాండ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 6.3 ఓవర్లలో భారత్ స్కాట్లాండ్ జట్టు పెట్టిన 85 పరుగుల లక్ష్యాన్ని సునయాసంగా గెలుపొందింది. 6.3 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీసి స్కాట్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించగా, బుమ్రా రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జార్జ్ మున్సీ చేసిన 24 పరుగులే అత్యధికం.మైఖేల్ లీస్క్ 21, కాలమ్ మాక్లియోడ్ 16, మార్క్ వాట్ 14 పరుగులు చేశారు. ఏడుగురు ఆటగాళ్లు కలిసి చేసింది ఆరు పరుగులు మాత్రమే. వీరిలో ముగ్గురు డకౌట్ కాగా, ఇద్దరు రెండేసి, మరో ఇద్దరు చెరో పరుగు చేశారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







