ICC T20: స్కాట్లాండ్ పై టీం ఇండియా ఘన విజయం
- November 05, 2021
దుబాయ్: స్కాట్లాండ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 6.3 ఓవర్లలో భారత్ స్కాట్లాండ్ జట్టు పెట్టిన 85 పరుగుల లక్ష్యాన్ని సునయాసంగా గెలుపొందింది. 6.3 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీసి స్కాట్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించగా, బుమ్రా రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జార్జ్ మున్సీ చేసిన 24 పరుగులే అత్యధికం.మైఖేల్ లీస్క్ 21, కాలమ్ మాక్లియోడ్ 16, మార్క్ వాట్ 14 పరుగులు చేశారు. ఏడుగురు ఆటగాళ్లు కలిసి చేసింది ఆరు పరుగులు మాత్రమే. వీరిలో ముగ్గురు డకౌట్ కాగా, ఇద్దరు రెండేసి, మరో ఇద్దరు చెరో పరుగు చేశారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









