రికార్డు స్థాయికి చేరుకొన్న బహ్రెయిన్ ప్రజా రవాణా వినియోగదారుల సంఖ్య
- March 20, 2016
ఈ నెల మార్చి 4 వ తేదీన బహ్రెయిన్ ప్రజా రవాణా వినియోగదారులు ఒక రికార్డును నమోదు చేశారు. ఆ ఒక్క రోజునే 52,000 మంది ప్రయాణికులు తమ బస్సుల ద్వారా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోన్నారని ఇది ఎంతో అరుదైన విషయమని రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ (ఎంటిటి) సహాయ కార్యదర్శి మరియం అహ్మద్ జుమాన్ పేర్కొన్నారు. ఈ రికార్డు ద్వారా ప్రజలకు ప్రబుత్వ బస్సు సేవలకు పెరుగుతున్న గిరాకీ బహ్రెయిన్ ప్రజా రవాణా సంస్థను ( బహరేన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ) ఉపయోగించుకోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. గత ఫిబ్రవరిలో 30,628 ప్రయాణికులు తమ యొక్క సేవలను పొందినట్లు తెలిపారు. కొత్త ప్రజా రవాణా సేవ యొక్క ప్రయోగం తర్వాత నుండి, ప్రయాణ వినియోగదారులు సంఖ్య ఎనిమిది మిలియన్లకు పైగా చేరుకుంది.
మనామా బస్సు టెర్మినల్ నుండి ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 10:30 వరకు నడుస్తున్న 32 బస్సు మార్గాలలో 17 మార్గాలు మనామా సెంటర్ మార్గాలను కలుపుతూ అత్యంత రద్దీగా ప్రయాణిస్తున్నట్లు ఆమె చెప్పారు. క్రొత్త స్మార్టుకార్డ్ సేవ సైతం ప్రయాణికులను రోజువారీ బస్సులు ఉపయోగించడానికి ఓ ముఖ్య కారణమని తెలిపారు. ప్రయాణికులకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









