రికార్డు స్థాయికి చేరుకొన్న బహ్రెయిన్ ప్రజా రవాణా వినియోగదారుల సంఖ్య
- March 20, 2016
ఈ నెల మార్చి 4 వ తేదీన బహ్రెయిన్ ప్రజా రవాణా వినియోగదారులు ఒక రికార్డును నమోదు చేశారు. ఆ ఒక్క రోజునే 52,000 మంది ప్రయాణికులు తమ బస్సుల ద్వారా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోన్నారని ఇది ఎంతో అరుదైన విషయమని రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ (ఎంటిటి) సహాయ కార్యదర్శి మరియం అహ్మద్ జుమాన్ పేర్కొన్నారు. ఈ రికార్డు ద్వారా ప్రజలకు ప్రబుత్వ బస్సు సేవలకు పెరుగుతున్న గిరాకీ బహ్రెయిన్ ప్రజా రవాణా సంస్థను ( బహరేన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ) ఉపయోగించుకోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. గత ఫిబ్రవరిలో 30,628 ప్రయాణికులు తమ యొక్క సేవలను పొందినట్లు తెలిపారు. కొత్త ప్రజా రవాణా సేవ యొక్క ప్రయోగం తర్వాత నుండి, ప్రయాణ వినియోగదారులు సంఖ్య ఎనిమిది మిలియన్లకు పైగా చేరుకుంది.
మనామా బస్సు టెర్మినల్ నుండి ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 10:30 వరకు నడుస్తున్న 32 బస్సు మార్గాలలో 17 మార్గాలు మనామా సెంటర్ మార్గాలను కలుపుతూ అత్యంత రద్దీగా ప్రయాణిస్తున్నట్లు ఆమె చెప్పారు. క్రొత్త స్మార్టుకార్డ్ సేవ సైతం ప్రయాణికులను రోజువారీ బస్సులు ఉపయోగించడానికి ఓ ముఖ్య కారణమని తెలిపారు. ప్రయాణికులకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









