స్కూళ్ల ఫీజుల దోపిడీ అరికడతాం : కేసీఆర్

- March 21, 2016 , by Maagulf
స్కూళ్ల ఫీజుల దోపిడీ అరికడతాం : కేసీఆర్

: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీ, అరాచకాలపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ నిర్వహిస్తున్న గురుకుల పాఠశాల ఆదర్శంగా నడుస్తోందన్నారు. గుర్తింపు లేని స్కూళ్లపై సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు అవసరమన్న సీఎం ప్రతిపక్ష సభ్యులు రాజకీయాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా సమగ్ర చర్చ జరగాల్సి ఉందన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com