స్కూళ్ల ఫీజుల దోపిడీ అరికడతాం : కేసీఆర్
- March 21, 2016
: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీ, అరాచకాలపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ నిర్వహిస్తున్న గురుకుల పాఠశాల ఆదర్శంగా నడుస్తోందన్నారు. గుర్తింపు లేని స్కూళ్లపై సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు అవసరమన్న సీఎం ప్రతిపక్ష సభ్యులు రాజకీయాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్పై కూడా సమగ్ర చర్చ జరగాల్సి ఉందన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







