యాక్సిడెంట్లో మృతిచెందిన చిన్నారికి కన్నీటి వీడ్కోలు
- March 21, 2016
అల్ మెస్లియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఐదేళ్ళ చిన్నారి ఐదెన్ షాజి వర్గీస్కి భారతీయ వలసదారులు కన్నీటి వీడ్కోలు పలికారు. శుక్రవారం సాయంత్రం ఐదెన్ మృతదేహాన్ని అతని స్వస్థలమైన కేరళలోని పథనమ్తిట్ట జిల్లాలోగల తిరువాలాకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. సర్వోదయ కిండర్గార్టెన్లో చదువుతున్న ఐదెన్, స్కూల్ బస్సులో వెళుతుండగా, బస్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదెన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో నలుగురు గాయాల పాలు కాగా, అందులో ఒకరికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. ఇంటి నుంచి మదినత్ ఖలీఫాలో గల స్కూల్కి వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కేరళ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎంకె మునీర్, ఖతార్లో పర్యటించారు. గురువారం ఆయన ఐదెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఐదెన్ తండ్రి షాజి వర్గీస్ ఖతార్ ఎయిర్వేస్లో పనిచేస్తున్నారు. ఐదెన్ తల్లి రీనా మాథ్యూ రుమైలా ఆసుపత్రిలో నర్స్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







