టీం ఇండియా టీ20 కెప్టెన్‎గా రోహిత్ శర్మ..

- November 09, 2021 , by Maagulf
టీం ఇండియా టీ20 కెప్టెన్‎గా రోహిత్ శర్మ..

టీం ఇండియా టీ20 కెప్టెన్‎గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.వైస్ కెప్టెన్‎గా కేఎల్ రాహుల్‎ను నియమించారు.న్యూజిలాండ్‎తో జరిగే సిరీస్‎కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.  ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. నవంబర్ 17, 2021 నుంచి భారత్ 3 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‎తో ద్రవిడ్ కోచ్‎గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్.

టీ20 సిరీస్ షెడ్యూల్:

నవంబర్ 17న మొదటి టీ20 మ్యాచ్ జైపూర్
నవంబర్ 19న రెండో టీ20 మ్యాచ్ రాంచీ
నవంబర్ 21న మూడో టీ20 మ్యాచ్ కోల్‎కత్తా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com