మిలటరీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు
- March 21, 2016
ఇండోనేషియాలో ఆదివారం మిలటరీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఈ విషయాన్ని అక్కడి మిలిటరీ అధికారులు వెల్లడించారు. సోమవారం మరో సైనికుడి మృతదేహాన్ని గుర్తించడంతో మృతుల సంఖ్య 13కు చేరిందని చెప్పారు. ఈ విషయమై మిలటరీ ప్రతినిధి మేజర్ జనరల్ తతాంగ్ సులేమాన్ మాట్లాడారు.'బెల్ 412 -ఈపీ' అనే మిలటరీ హెలీకాఫ్టర్ 13 మంది సైనికులతో పోసో జిల్లాలోని వతుతువా గ్రామం నుంచి ఆదివారం టేకాఫ్ అయింది.టేకాఫ్ అయిన 35 నిమిషాల్లో ఇంజిన్లో మంటలు చెలరేగి కూలిపోయింది. ఆదివారం నాడు 12 మృతదేహాల్ని గుర్తించగా సోమవారం మరో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఆ హెలీకాఫ్టర్ కొని మూడేళ్లైందని చెప్పారు. ప్రయాణం సమయంలో ఆకాశంలో మెరుపులు రావడంతో మెరుపుల దాటికి దానిలో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







