మిలటరీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు
- March 21, 2016
ఇండోనేషియాలో ఆదివారం మిలటరీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఈ విషయాన్ని అక్కడి మిలిటరీ అధికారులు వెల్లడించారు. సోమవారం మరో సైనికుడి మృతదేహాన్ని గుర్తించడంతో మృతుల సంఖ్య 13కు చేరిందని చెప్పారు. ఈ విషయమై మిలటరీ ప్రతినిధి మేజర్ జనరల్ తతాంగ్ సులేమాన్ మాట్లాడారు.'బెల్ 412 -ఈపీ' అనే మిలటరీ హెలీకాఫ్టర్ 13 మంది సైనికులతో పోసో జిల్లాలోని వతుతువా గ్రామం నుంచి ఆదివారం టేకాఫ్ అయింది.టేకాఫ్ అయిన 35 నిమిషాల్లో ఇంజిన్లో మంటలు చెలరేగి కూలిపోయింది. ఆదివారం నాడు 12 మృతదేహాల్ని గుర్తించగా సోమవారం మరో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఆ హెలీకాఫ్టర్ కొని మూడేళ్లైందని చెప్పారు. ప్రయాణం సమయంలో ఆకాశంలో మెరుపులు రావడంతో మెరుపుల దాటికి దానిలో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









