'ఖిలాడీ' విడుదల తేదీ ఖరారు
- November 11, 2021
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ "ఖిలాడి". సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలు. ఎ స్టూడియోస్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పూర్తి భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్మార్ట్ ప్లే అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 11, 2022న ఖిలాడీ తెరపైకి రానుందని మేకర్స్ ప్రకటించారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ సిగరెట్ తాగుతూ ఘాటైన రూపంలో కనిపిస్తున్నాడు. మాస్ మహారాజ అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









