'ఖిలాడీ' విడుదల తేదీ ఖరారు
- November 11, 2021హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ "ఖిలాడి". సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలు. ఎ స్టూడియోస్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పూర్తి భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్మార్ట్ ప్లే అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 11, 2022న ఖిలాడీ తెరపైకి రానుందని మేకర్స్ ప్రకటించారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ సిగరెట్ తాగుతూ ఘాటైన రూపంలో కనిపిస్తున్నాడు. మాస్ మహారాజ అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు