రెసిడెన్సీ ఉల్లంఘనులకు క్షమాభిక్ష లేదు
- November 12, 2021
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా క్షమాభిక్ష పెట్టేది లేదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. కోవిడ్ నేపథ్యంలో మానవీయ కోణంలో నాలుగుసార్లు క్షమాభిక్షకు అవకాశం కల్పించినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఎలాంటి జరీమానా చెల్లించకుండా, ఉచితంగా టిక్కెట్లను కల్పించి మరీ దేశం విడిచి వెళ్ళేందుకు కొందరికి అవకాశం కల్పించిన కువైట్, కొందరు ఉల్లంఘనులు తమ స్టేటస్ సరి చేసుకునేందుకూ అవకాశం ఇచ్చింది. అయినాగానీ, సుమారుగా 160,000 మంది ఉల్లంఘనులు క్షమాభిక్షను వినియోగించుకోలేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని అథారిటీస్ స్పష్టం చేశాయి. జరీమానా చెల్లించి ఉల్లంఘనులు దేశం విడిచి వెళ్ళాలనీ, అనంతరం వారు కొత్త వీసాపై తిరిగి వచ్చేందుకు అవకాశం వుందని కువైట్ పేర్కొంది. అలా ముందుకు రాని వారిని అథారిటీస్ గుర్తించి పట్టుకుని, దేశం నుంచి పంపేస్తే, వారిపై జీవిత కాలం బ్యాన్ వుంటుందని అధికారులు తెలిపారు. వారు జిసిసి దేశాలకు ఐదేళ్ళ వరకు వచ్చేందుకు వీలుండదని కువైట్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







