రెసిడెన్సీ ఉల్లంఘనులకు క్షమాభిక్ష లేదు
- November 12, 2021
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా క్షమాభిక్ష పెట్టేది లేదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. కోవిడ్ నేపథ్యంలో మానవీయ కోణంలో నాలుగుసార్లు క్షమాభిక్షకు అవకాశం కల్పించినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఎలాంటి జరీమానా చెల్లించకుండా, ఉచితంగా టిక్కెట్లను కల్పించి మరీ దేశం విడిచి వెళ్ళేందుకు కొందరికి అవకాశం కల్పించిన కువైట్, కొందరు ఉల్లంఘనులు తమ స్టేటస్ సరి చేసుకునేందుకూ అవకాశం ఇచ్చింది. అయినాగానీ, సుమారుగా 160,000 మంది ఉల్లంఘనులు క్షమాభిక్షను వినియోగించుకోలేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని అథారిటీస్ స్పష్టం చేశాయి. జరీమానా చెల్లించి ఉల్లంఘనులు దేశం విడిచి వెళ్ళాలనీ, అనంతరం వారు కొత్త వీసాపై తిరిగి వచ్చేందుకు అవకాశం వుందని కువైట్ పేర్కొంది. అలా ముందుకు రాని వారిని అథారిటీస్ గుర్తించి పట్టుకుని, దేశం నుంచి పంపేస్తే, వారిపై జీవిత కాలం బ్యాన్ వుంటుందని అధికారులు తెలిపారు. వారు జిసిసి దేశాలకు ఐదేళ్ళ వరకు వచ్చేందుకు వీలుండదని కువైట్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







