రాజకీయ నాయకుల తీరుపై భారత ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు
- November 12, 2021
నెల్లూరు: ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టలు, మాట్లాడే మాటలు రోత పుట్టిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరులోని ఓ స్థానిక పత్రిక 40ఏళ్ల వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాటలు, తెలుగు కట్టు, బొట్టు చాలారోజుల తరువాత చూడటం సంతోషంగా ఉందన్నారు. ఈ రాజ్యాంగ హోదా అలంకారంగా కనిపిస్తోందన్నారు.

జనంతో కలిసి జనంతో మాట్లాడుతుంటే దానిలో ఉండే ఆనందం ఈ రాజ్యాంగ హోదాలో లేదన్నారు. సంతోషంగా ఉండాలంటే అందరితో కలిసి తిరగాలని ఆయన సూచించారు. చదువు చెప్పిన గురువుని సన్మానించుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. కరోనాను ఎదిరించడంలో ముందుండి అశువులు బాసిన జర్నలిస్టులు, వైద్యసిబ్బందికి ఆయన నివాళులర్పించారు. అనంతరం 40 మంది నెల్లూరు ప్రముఖులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిని సన్మానించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!







