టిక్కెట్ ధరల్లో 50 శాతం తగ్గుదల: టూరిజం మరియు ట్రావెల్ కార్యాలయాల వెల్లడి

- November 13, 2021 , by Maagulf
టిక్కెట్ ధరల్లో 50 శాతం తగ్గుదల: టూరిజం మరియు ట్రావెల్ కార్యాలయాల వెల్లడి

కువైట్: టూరిజం సీజన్ కాకపోయినా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నందున కువైట్ వచ్చే ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే సమయంలో, టిక్కెట్ ధరలు కూడా తగ్గినట్లు ట్రావెల్ మరియు టూరిజం కార్యాలయాలు పేర్కొంటున్నాయి. గడచిన రెండు నెలల క్రితం నాటి పరిస్థితితో పోల్చితే, సగం మేర టిక్కెట్ ధరలు (కువైట్ వచ్చేందుకు) తగ్గినట్లు తెలుస్తోంది. ఇండియా అలాగే ఫిలిప్పీన్స్ తదితర దేశాల నుంచి ఎక్కువగా ఎరైవల్స్ వుంటున్నాయి. కోటా విధానం రద్దు చేయడం కూడా కలిసొచ్చింది. సౌదీ అరేబియా, టర్కీ మరియు ఈజిప్టు నుంచి కువైట్ మధ్య ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం కోటాలో 60 నుంచి డెబ్భయ్ శాతం ఈ ప్రయానాలే వుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com