సంతకాల ఫోర్జరీ కేసు.. కోర్టులో అప్పీల్ ఫైల్ చేసిన నిందితుడు
- November 14, 2021
బహ్రెయిన్: సంతకాలను ఫోర్జరీ చేసి పనిమనిషులను అక్రమంగా దేశంలోకి తెచ్చిన కేసులో 6 ఏండ్ల శిక్ష పడ్డ ఓ నిందితుడు బహ్రెయిన్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అతడి అప్పీల్ ను విచారించేందుకు కోర్టు అనుమతించింది. కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ప్రకారం.. నిందితుడుగా భావిస్తున్న వ్యక్తి.. ఇద్దరు వ్యక్తులకు తెలియకుండా వార్ల పేర్ల మీద పనిమనిషులను తీసుకొచ్చాడు. దీని కోసం అతడు వారి సంతకాలను ఫోర్జరీ చేశాడు. ఈ విషయం వాళ్లకు తెలియడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసి విచారించారు. ఇతరుల పేర్లతో అక్రమంగా పనిమనిషులను తెచ్చినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. దీంతో ఇతరుల సంతకాలను ఫోర్జరీ చేసి పనిమనుషులను అక్రమంగా తీసుకొచ్చిన కేసుల్లో క్రిమినల్ కోర్టు ఆరేండ్ల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







