సంతకాల ఫోర్జరీ కేసు.. కోర్టులో అప్పీల్ ఫైల్ చేసిన నిందితుడు
- November 14, 2021
బహ్రెయిన్: సంతకాలను ఫోర్జరీ చేసి పనిమనిషులను అక్రమంగా దేశంలోకి తెచ్చిన కేసులో 6 ఏండ్ల శిక్ష పడ్డ ఓ నిందితుడు బహ్రెయిన్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అతడి అప్పీల్ ను విచారించేందుకు కోర్టు అనుమతించింది. కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ప్రకారం.. నిందితుడుగా భావిస్తున్న వ్యక్తి.. ఇద్దరు వ్యక్తులకు తెలియకుండా వార్ల పేర్ల మీద పనిమనిషులను తీసుకొచ్చాడు. దీని కోసం అతడు వారి సంతకాలను ఫోర్జరీ చేశాడు. ఈ విషయం వాళ్లకు తెలియడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసి విచారించారు. ఇతరుల పేర్లతో అక్రమంగా పనిమనిషులను తెచ్చినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. దీంతో ఇతరుల సంతకాలను ఫోర్జరీ చేసి పనిమనుషులను అక్రమంగా తీసుకొచ్చిన కేసుల్లో క్రిమినల్ కోర్టు ఆరేండ్ల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!









