ఫ్యామిలీ, టూరిస్ట్ వీసాల జారీ ప్రక్రియ కఠినతరం
- November 14, 2021
కువైట్: ఫ్యామిలీ, టూరిస్ట్ విసాల జారీపై నియంత్రణలను కఠినంగా అమలు చేయాలని కువైట్ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో కమర్షియల్ విజిట్ వీసాలు, టూరిస్ట్, అఫీషియల్ గవర్నమెంట్ విజట్ వీసాల జారీని మరింత సరళతరం చేయాలని కేబినెట్ సూచించింది. అలాగే దేశంలోకి వచ్చే వారిని నియంత్రించాలని అధికారులను ఆదేశించింది. మెడికల్, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వారి ఫ్యామిలీ వీసాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని మినిస్ట్రి ఆఫ్ ఇంటిరియర్ అధికారులను కేబినెట్ ఆదేశించింది. KD500 కంటే ఎక్కువగా సాలరీ ఉన్న వారికి మాత్రమే భార్య, 16 ఏండ్లలోపు పిల్లలను తెచ్చుకునేందుకు ఫ్యామిలీ వీసాలను జారీ చేయాలని రెసిడెన్సీ అఫైర్స్ డిపార్టుమెంట్ డైరెక్టర్స్ ని ఆదేశించింది. ఫ్యామిలీ వీసాలకు దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ సర్టిఫికేట్లను సమర్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు నెలల లోపు వారి ఫ్యామిలీ మెంబర్లను తిరిగి పంపాలని కేబినెట్ సూచించింది.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









