2,221 మందిపై దేశ బహిష్కరణ వేటు..!
- November 15, 2021
కువైట్: అక్టోబర్ 1 నుంచి మే 10 మధ్య అరెస్టయిన రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 2,221 మంది ప్రవాసులను బహిష్కరించేందుకు సిఫార్సు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు రెసిడెన్స్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్-జనరల్ అన్వర్ అల్-బర్జాస్ భద్రతా అధికారులను ఆదేశించారు. అదే విధంగా రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ అధికారులు 22 గృహకార్మికుల కార్యాలయాలపై దాడి చేసి నిబంధనలను ఉల్లంఘించి ఆశ్రయం పొందుతున్న 106 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది స్పాన్సర్లు పరారీలో ఉన్నారు. సిటిజన్స్, రెసిడెంట్స్ తమ స్పాన్సర్షిప్లో లేకుంటే ఏ కార్మికులకు ఆశ్రయం కల్పించవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఆశ్రయం కల్పిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







