వాట్సాప్ లో ఫ్రెండ్ ఫోటోను మార్ఫింగ్ చేసిన వ్యక్తి. చివాట్లు పెట్టిన కోర్టు
- November 15, 2021
యూఏఈ: ఫ్రెండ్ ను ఆటపట్టించేందుకు వాట్సాప్ లో చేసిన చిన్నసరదా పని.. చివరకు కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఇటీవల ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మరో ఫ్రెండ్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో వారు కొన్ని ఫోటోలను తీసుకున్నారు. కొంతకాలం తర్వాత ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడానికి వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు. వారందరూ పొలంలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను ఒక వ్యక్తి అందులో షేర్ చేశాడు. అయితే అందులో ఒక ఫ్రెండ్ ను సరదాగా ఆటపట్టించేందుకు అతని ఫోటోని మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేశాడు. ఇది జోక్ కోసమే చేసినా.. గ్రూప్ లో అప్లోడ్ అయిన వెంటనే గ్రూప్లోని ప్రతి ఒక్కరూ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎగతాళి చేయడం ప్రారంభించారు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు.. ఫోటోని మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంబంధిత అధికారులు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. విచారణ సందర్భంగా ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్.. ఫోటో మార్చి పోస్ట్ చేసిన వ్యక్తికి చివాట్లు పెట్టింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో స్నేహితుల మధ్య స్నేహం, ఫ్రెండ్ షిప్, సరదాగా ఉండటం మంచి విషయమని చెబుతూనే.. ఇది అవతలి వారి మనోభావాలను కించపరిచేలా ఉండొద్దని హెచ్చరించింది. ఎవైనా సరే చట్టపరమైన పరిధిలో ఉండాలని సదరు వ్యక్తికి సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







