"భారత్ మాతాకి జై" ఎందుకంటే: -
- March 21, 2016
మనిషిని, గొడ్డుని వేరు చేసేది భావోద్వేగం. "భారత్ మాతా కి జై" అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం. పోరాట స్ఫూర్తి, ఐకమత్యం, సౌభ్రాతృత్వం అన్నీ భావోద్వేగాల్లోంచే వస్తాయి. అదే లేకపోతే స్వాతంత్రపోరాటమే లేదు. భావోద్వేగానికి లాజిక్ ఉండదు. ఉండాల్సిన అవసరం లేదు. "భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరసోదరీమణులు" అని స్కూల్లో చెప్పే ప్లెడ్జ్ లో కూడా లాజిక్ వెతికి "అందరూ సోదర సోదరీమణులు ఎలా అవుతారు? అర్థం లేకుండా!" అంటే అలా అన్నవాడిలో భావోద్వేగ నరం పనిచేయడం లేదని అర్థం. ఇంతకీ ఆ ప్లెడ్జ్ రాసింది ఒక తెలుగు వాడు. పేరు పైడిమర్రి వేంకట సుబ్బారావు. ఆయన తెలుగులో వ్రాస్తే అది దేశమంతా అన్ని భాషల్లోనూ చెప్తున్నారిపుడు. ఇలా తెలుగువాడు అని చెప్పుకోవడంలో కూడా భావోద్వేగం ఉంది. అదేదో సినిమా డయలాగ్ లాగ మూడు సింహాల చిహ్నం చూసినప్పుడల్లా నాకు ఇలా అనిపిస్తుంది.
"అశోక చిహ్నంలో
కనిపించని
నాలుగో సింహం-
భరతమాత వాహనం".
ఇలా అనుకోవడంలో కూడా నామటుకు నాకు భావోద్వేగం ఉంది.
-సిరాశ్రీ.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









