"భారత్ మాతాకి జై" ఎందుకంటే: -
- March 21, 2016మనిషిని, గొడ్డుని వేరు చేసేది భావోద్వేగం. "భారత్ మాతా కి జై" అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం. పోరాట స్ఫూర్తి, ఐకమత్యం, సౌభ్రాతృత్వం అన్నీ భావోద్వేగాల్లోంచే వస్తాయి. అదే లేకపోతే స్వాతంత్రపోరాటమే లేదు. భావోద్వేగానికి లాజిక్ ఉండదు. ఉండాల్సిన అవసరం లేదు. "భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరసోదరీమణులు" అని స్కూల్లో చెప్పే ప్లెడ్జ్ లో కూడా లాజిక్ వెతికి "అందరూ సోదర సోదరీమణులు ఎలా అవుతారు? అర్థం లేకుండా!" అంటే అలా అన్నవాడిలో భావోద్వేగ నరం పనిచేయడం లేదని అర్థం. ఇంతకీ ఆ ప్లెడ్జ్ రాసింది ఒక తెలుగు వాడు. పేరు పైడిమర్రి వేంకట సుబ్బారావు. ఆయన తెలుగులో వ్రాస్తే అది దేశమంతా అన్ని భాషల్లోనూ చెప్తున్నారిపుడు. ఇలా తెలుగువాడు అని చెప్పుకోవడంలో కూడా భావోద్వేగం ఉంది. అదేదో సినిమా డయలాగ్ లాగ మూడు సింహాల చిహ్నం చూసినప్పుడల్లా నాకు ఇలా అనిపిస్తుంది.
"అశోక చిహ్నంలో
కనిపించని
నాలుగో సింహం-
భరతమాత వాహనం".
ఇలా అనుకోవడంలో కూడా నామటుకు నాకు భావోద్వేగం ఉంది.
-సిరాశ్రీ.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు