‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ పై క్లారిటీ
- November 16, 2021పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మూవీ మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గట్టు స్క్రీన్ ప్లేలో పలు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి బరిలో ముందుగా జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా విడుదలైన 5 రోజులకు ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఐతే.. ముందు నుంచి భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ సినిమా విడుదల తేదిలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవనట్టు ఓ పోస్టర్స్ రిలీజ్ చేసి ఈ సినిమా విడుదల తేదిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు మూవీ మేకర్స్.
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్స్, పాటలతో కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతోందని అంటున్నారు. అందులో భాగంగానే భీమ్లా నాయక్ నైజాం హక్కులు రూ. 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ప్రమోషన్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మరో సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం. లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్ను తివిక్రమ్ రాసారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు. హీరో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట నెటిజన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ (Aditya music) ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్తో పాటు రానా దగ్గుబాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్య మీనన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఆ సినిమాతో పాట పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ను ప్రకటించారు.
ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్.. తథా వ్యవహరమ్.. అనే సినిమాను చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను ఖరారు చేశారు.ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్