ఈ నెల 24 నుంచి యూఏఈ-ఇండియా మధ్య కొత్తగా బడ్జెట్ ఫ్లైట్ సర్వీస్

- November 18, 2021 , by Maagulf
ఈ నెల 24 నుంచి యూఏఈ-ఇండియా మధ్య కొత్తగా బడ్జెట్ ఫ్లైట్ సర్వీస్

యూఏఈ :  ఇండియా, యూఏఈ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఈ నెల 24 నుంచి అబుదాబి నుంచి ఢిల్లీ కి ఎయిర్ అరేబియా కొత్తగా ఫ్లైట్ సర్వీస్ ను ప్రారంభించనుంది. ప్రయాణికుల బడ్జెట్ కు అనుగుణంగా ఫ్లైట్ ఛార్జీలు ఉండనున్నాయి. ప్రయాణికులు డైరెక్ట్ గా అబుదాబి నుంచి ఢిల్లీ వెళ్లవచ్చు. వారంలో నాలుగు రోజులు ఈ ఫ్లైట్ సేవలు అందుబాటులో ఉంటాయి. సోమ, బుధ, గురు, శని వారాల్లో అబుదాబి నుంచి ఉదయం 10.35 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. మళ్లీ రిటర్న్ ఫ్లైట్ అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుందని ఎయిర్ అరేబియా అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com