ఫిబ్రవరిలో అతి పెద్ద సాంకేతిక వేదికను నిర్వహించనున్న సౌదీ అరేబియా

- November 20, 2021 , by Maagulf
ఫిబ్రవరిలో అతి పెద్ద సాంకేతిక వేదికను నిర్వహించనున్న సౌదీ అరేబియా

రియాద్: సౌదీ అరేబియా, అతి పెద్ద టెక్నాలజీ ఈవెంట్‌ని ఫిబ్రవరిలో నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు రియాద్‌లో జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ వేదికపై కనిపించనున్నారు. కాస్పర్‌స్కై సీఈఓ యూజెన్ కాస్పర్‌స్కై, విఎంవేర్ సీఈో రఘు రఘురామ్, టెక్ స్టార్స్ సీఈో మాలీ గావెట్, హుండై మోటర్ గ్రూప్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మరియు ప్రెసిడెంట్ యోంగ్‌చో తదితరులు ఈ వేదికపై నుంచి ప్రసంగిస్తారు. ఇన్ఫోమా మార్కెట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మైక్రోసాఫ్ట్, సిస్కో, కెపిఎంజి, వంటి మేటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com