పంబానదికి భారీ వరద..శబరిమలలో భక్తులకు దర్శనాలు నిలిపివేత
- November 20, 2021
పంబానదికి వరద ఉధృతి పెరిగింది. ఈ వరద ఉధృతి ప్రభావం శబరిమల ఆలయ దర్శనాలపై పడింది. వరద పెరగడంతో శబరిమల ఆలయంలోకి భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరద తీవ్రత తగ్గిన తరువాతే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, కల్కి-ఆంథోడ్ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. ఏ క్షణంలో అయినా రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నది.
దిగువప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గత కొన్ని రోజులుగా పంబానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేరళలోని నదులకు వరద చేరింది. వారం రోజుల క్రితమే శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఇంతలోనే పంబానదికి వరద రావడంతో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









