మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- February 21, 2026
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ దమ్మ' భవనాన్నిఆయన కుటుంబ సభ్యులు శనివారం ఆవిష్కరించనున్నారు. మాజీ పరిశ్రమల శాఖ మంత్రి స్వర్గీయ మేకపాటి గౌతంరెడ్డి వర్ధంతి సందర్భంగా రూ.1.4కోట్లతో ఏర్పాటు చేసిన భవనం శనివారం ప్రారంభోత్సవం జరగనుంది. ఏయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసెంబ్లీ మందిరం వెనుక భాగంలో నూతన మహాబోధి సొసైటీ , ఏయూ సంయుక్తంగా నిర్వహించే ఈ కేంద్రానికి మే,2023లో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. విశాఖ నగరం మధ్యలో ప్రజలకు ఉపయుక్తంగా సువిశాల ప్రాంగణంలో మెడిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో గౌతం విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి గౌతం సతీమణి శ్రీకీర్తి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి, గౌతం సోదరుడు పృథ్వీ తదితర కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు.
నియోజకవర్గంలోనూ విస్తృత సేవా కార్యక్రమాలు
కీర్తిశేషులు మేకపాటి గౌతంరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, గౌతంరెడ్డి అభిమానులు నివాళి అర్పించనున్నారు. ఉదయం 10.30గం.లకు ఆత్మకూరులోని ఎంజీఆర్ మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాలకు పూలమాల వేసి, నివాళి పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







