తిరుపతి ముంపు ప్రాంతాల్లో ఎన్.ఆర్.ఐల సహాయక చర్యలు

- November 20, 2021 , by Maagulf
తిరుపతి ముంపు ప్రాంతాల్లో ఎన్.ఆర్.ఐల సహాయక చర్యలు

తిరుపతి:వరద సహాయార్థం తిరుపతి కి చెందిన డాక్టర్ ముక్కు తులసి కుమార్ తన పుట్టిన ఊరి లో వరదలు విలయతాండవం చేస్తున్నతరుణం లో స్నేహితులతో కలిసి తిరుపతి ముంపు ప్రాంతాల్లో పర్యటించి, ముక్కు తులసి కుమార్,ఈ.వి.వి సతీష్ కుమార్ తో కలిసి సంయుక్తంగా స్కావెంజర్ కాలనీ,ఎసిటివి నగర్లలో మూడు వందల కుటుంబాలకు తక్షణ సహాయం కింద బియ్యం పంపిణి చేసారు.వరదలు అనుకోకుండా పెరగడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడడం ప్రత్యక్షంగా చూసి మనసు చెలించడం వలన తన స్నేహితులతో లలిసి మాతృభూమికి చిన్న సహాయం చేయాలనీ ఆలోచనతో  బియ్యం పంపిణి కార్యక్రమం చేసానని , అందరు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.

విదేశాలలో ఉన్న తన స్నేహితులు అనేకమంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారన్నారు.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.మరిన్ని ప్రాంతాల్లో బియ్యం పంపిణి కార్యక్రమం కొనసాగుతుందని ముక్కు తులసి కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి,మల్లి కార్జున తదితరులు పాల్గొన్నారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com