సరైన ఆధారాలు లేవు...ఓ వ్యక్తి మరణం కేసులో నిందితుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

- November 21, 2021 , by Maagulf
సరైన ఆధారాలు లేవు...ఓ వ్యక్తి మరణం కేసులో నిందితుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

బహ్రెయిన్: నిర్లక్షపూరితంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడన్న కారణంతో పోలీసులు పెట్టిన కేసును హై క్రిమినల్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న దానికి సరైన ఆధారాలను ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేయలేదని తెలిపింది. తన తోటి వ్యక్తి మరణానికి అతను కారణం కాదని తేల్చింది. కొన్ని రోజుల క్రితం ఓ ఫ్యాక్టరీలోని  బాయిలర్ లో మంటలు చెలరేగి ఓ వ్యక్తి చనిపోయాడు. ఐతే తన తోటి ఎంప్లాయి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బాయిలర్ బాటన్ ఆన్ చేయటం కారణంగానే అతను చనిపోయినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే విచారణలో భాగంగా సీసీటీవీని ఫుటేజ్ ను కోర్టు పరిశీలించింది. ఇందులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి తప్పేమీ లేదని క్లియర్ గా కనబడుతుందని కోర్టు తేల్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చేలరేగాయని స్పష్టం చేసింది. 14 హియరింగ్స్  తర్వాత ఈ కేసులో నిందితుడిని నిర్దోషని తేల్చుతూ కోర్టు తీర్పు ఇచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com