స్కూల్ బస్సెస్ స్టాప్ సిగ్నల్స్ పట్టించుకోని 492 మంది వాహనాదారులకు ఫైన్
- November 22, 2021
అబుధాబి: స్కూల్ పిల్లలు ప్రయాణించే బస్సులకు సంబంధించిన ప్రభుత్వం ఎంత కేర్ తీసుకుంటుందో తెలిసిందే. స్కూల్ పిల్లలు ఉన్న బస్సు స్టాప్ సిగ్నల్ చూపిస్తే వాహనాదారులు 500 మీటర్ల ముందే ఆగాల్సి ఉంటుంది. కానీ చాలా మంది డ్రైవర్లు ఇది లెక్క చేయటం లేదు. స్కూల్ పిల్లలున్న బస్సు సమీపంలో కూడా రాష్ గా డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి 492 మంది వాహనాదారులకు ఫైన్లు వేశారు. ఒక్కొక్కరికి 1000 దిర్హామ్స్ ఫైన్ తో పాటు 10 బ్లాక్ పాయింట్లు రిజిస్టర్ చేశారు. అదే విధంగా బస్సు డ్రైవర్లకు కూడా కచ్చితంగా స్టాప్ బోర్డును చూపించాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. లేదంటే 600 దిర్హామ్స్ ఫైన్ వేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









