యూఏఈ కేబినెట్ కీలక నిర్ణయం. పేదలకు హౌసింగ్ లోన్ మాఫీ
- November 30, 2021
యూఏఈ: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆదాయం తక్కువ గా ఉన్న ప్రజలకు హౌసింగ్ లోన్ మాఫీ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక అసమానతలను తగ్గించటం, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు ఈ డిసిషన్ తీసుకున్నట్లు ప్రకటించింది. దుబాయ్ లో జరుగుతున్న ఎక్స్ పో 2020 లో సమావేశమైన యూఏఈ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. దీంతో వేలాది కుటుంబాలకు మేలు జరగనుంది. యూఏఈ వైస్ ప్రెసిడెండ్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశమైంది. హౌసింగ్ లోన్ మాఫీతో పాటు కీలకమైన నేషనల్ మెడిసిన్ పాలసీకి కూడా ఆమోద ముద్ర వేసిది. ఈ నిర్ణయం కారణంగా దేశ ఫార్మాసిటికల్ రంగంలో అద్భుతమైన మార్పులు రానున్నాయి. ఫార్మా రంగంలో దేశీయ టాలెంట్ ను వాడుకోనున్నారు. అదే విధంగా ఖరీదైన మందులు పేదలకు కూడా అందుబాటులో ఉండేలా చేయనున్నారు. దీంతో పాటు పలు పొలిటికల్ డిసిషన్స్ ను కూడా సమావేశంలో తీసుకున్నారు. ఈ మీటింగ్ కు లెప్ట్ నెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్ యాన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటిరీయర్ మినిస్టర్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహియాన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!







