యూఏఈ కేబినెట్ కీలక నిర్ణయం. పేదలకు హౌసింగ్ లోన్ మాఫీ
- November 30, 2021యూఏఈ: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆదాయం తక్కువ గా ఉన్న ప్రజలకు హౌసింగ్ లోన్ మాఫీ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక అసమానతలను తగ్గించటం, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచేందుకు ఈ డిసిషన్ తీసుకున్నట్లు ప్రకటించింది. దుబాయ్ లో జరుగుతున్న ఎక్స్ పో 2020 లో సమావేశమైన యూఏఈ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. దీంతో వేలాది కుటుంబాలకు మేలు జరగనుంది. యూఏఈ వైస్ ప్రెసిడెండ్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశమైంది. హౌసింగ్ లోన్ మాఫీతో పాటు కీలకమైన నేషనల్ మెడిసిన్ పాలసీకి కూడా ఆమోద ముద్ర వేసిది. ఈ నిర్ణయం కారణంగా దేశ ఫార్మాసిటికల్ రంగంలో అద్భుతమైన మార్పులు రానున్నాయి. ఫార్మా రంగంలో దేశీయ టాలెంట్ ను వాడుకోనున్నారు. అదే విధంగా ఖరీదైన మందులు పేదలకు కూడా అందుబాటులో ఉండేలా చేయనున్నారు. దీంతో పాటు పలు పొలిటికల్ డిసిషన్స్ ను కూడా సమావేశంలో తీసుకున్నారు. ఈ మీటింగ్ కు లెప్ట్ నెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్ యాన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటిరీయర్ మినిస్టర్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహియాన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన