మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించిన యూఏఈ..
- November 30, 2021
యూఏఈ: యూఏఈ కఠినమైన మాదకద్రవ్యాల చట్టాన్ని సవరించింది. గంజాయిలోని ప్రధాన మత్తుపదార్థ రసాయనమైన టీసీహెచ్ను తమ దేశంలోకి తీసుకొచ్చే వారికి విధించే శిక్షలను సవరించింది. ఇకపై గంజాయితో చేసిన ఆహారపదార్థాలు, పానీయాలు, ఇతర పదార్థాలను తమ దేశంలోకి తీసుకొస్తూ తొలిసారి పట్టుబడే వారికి జైలు శిక్ష ఉండదని తెలిపింది. అధికారులు మాత్రం ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని నాశనం చేస్తారని వెల్లడించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయంపై యూఏఈలో కఠినమైన ఆంక్షలున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా చేసినా, వినియోగించినట్టు రుజువైనా ఇక్కడ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







