కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో పబ్లిక్ ప్లేస్ లలో 80 శాతం అనుమతి
- November 30, 2021అబుధాబి: కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్లేస్ లలో ఆంక్షలను సడలించాలని నిర్ణయించింది. రెస్టారెంట్లు, పార్క్ లు, స్పోర్ట్స్ సెంటర్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఎంటర్ టైన్ మెంట్ ప్లేస్ లలో ఇక నుంచి 80 శాతం కెపాసిటీ కి అనుమతించనున్నారు. దీంతో మళ్లీ హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ వ్యాపారం పెరగనుంది. చాలా మంది వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ అనుమతితో అబుధాబి డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ (ADDED) ఈ డిసిషన్ తీసుకుంది. ఐతే హెల్త్ క్లబ్స్, జిమ్ లలో మాత్రం 50 శాతం కెపాసిటీతోనే నడపాలని సూచించింది. రెస్టారెంట్లు, కేఫ్ లలో ఒకే టేబుల్ వద్ద 10 మంది కన్నా ఎక్కువగా కుర్చోవటానికి వీల్లేదని ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకటించింది. ఇక పబ్లిక్ ప్లేస్ లు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ లో పనిచేసే వ్యక్తులందరికీ కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ కావాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పూర్తైన వారే పబ్లిక్ ప్లేస్ లలో రావాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం