తెలంగాణలో 6 విమానాశ్రయాల స్టేటస్ను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- November 30, 2021
తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులకు సంబంధించిన స్టేటస్ను మంగళవారం నాడు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ సురేష్రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విమానాయానశాఖ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, ఆదిలాబాద్లో, మహబూబ్నగర్ జిల్లాలో మూడు బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.
ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై స్టడీని పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రదేశాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణం పూర్తి కావడం అనేది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందన్నారు. మరోవైపు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు విస్తరణ 2022 డిసెంబర్ వరకు పూర్తవుతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టు విస్తరణ పూర్తయ్యాక ప్రయాణికుల సామర్థ్యం ఏడాది 1.2 కోట్ల నుంచి 3.4 కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







