తెలంగాణలో 6 విమానాశ్రయాల స్టేటస్ను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- November 30, 2021తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులకు సంబంధించిన స్టేటస్ను మంగళవారం నాడు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ సురేష్రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర విమానాయానశాఖ మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, ఆదిలాబాద్లో, మహబూబ్నగర్ జిల్లాలో మూడు బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.
ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై స్టడీని పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రదేశాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణం పూర్తి కావడం అనేది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందన్నారు. మరోవైపు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు విస్తరణ 2022 డిసెంబర్ వరకు పూర్తవుతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టు విస్తరణ పూర్తయ్యాక ప్రయాణికుల సామర్థ్యం ఏడాది 1.2 కోట్ల నుంచి 3.4 కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!