ప్రవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ..
- November 30, 2021
కువైట్: వలసదారులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఇకపై వలసదారులు ప్రతియేటా 130 కువైటీ దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి రెండేళ్లకు ఒకసారి 20 కేడీలు పెంచడం జరుగుతుంది. తొమ్మిదేళ్ల తర్వాత ప్రతి మనిషికి 190 కువైటీ దినార్ల కు ఫ్రీజ్ చేస్తారు. ఈ మేరకు హెల్త్ అస్సూరెన్స్ హాస్పిటల్స్ కంపెనీ(ధామన్) సీఈఓ థామర్ అరబ్ వెల్లడించారు. ఈ కొత్త ధామన్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి రెసిడెంట్కు తప్పనిసరి అని ఈ సందర్భంగా థామర్ అరబ్ వెల్లడించారు. ఈ పాలసీలో రెసిడెంట్కు కావాల్సిన ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అన్ని అవసరాలను కవర్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అందించే వైద్య సలహా, డయాగ్నసిస్, చికిత్స, మందులు ఇలా ప్రతిది ఇందులో ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఆరోగ్యశాఖ నివాసితులకు అందిస్తున్న 50 కేడీల తప్పనిసరి ఇన్సూరెన్స్ పాలసీ స్థానంలో ఈ కొత్త పాలసీని తీసుకువస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







