6 లక్షలకుపైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు
- November 30, 2021న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం నాడు తెలిపారు.లోకసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.విదేశాంగ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 1.33 కోట్లకు పైగా భారతీయులు విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు.ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. 2017లో 1,33,049 తమ భారత పౌరసత్వాన్ని ఒదులుకోగా..2018లో 1,34,561.. 2019లో 1,44,017.. 2020లో 85,248 తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 1,11,287 మంది ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే..విదేశాల్లో భారత సంతతి వారు తమ తమ రంగాల్లో విజయం కేతనం ఎగరేస్తున్నారు.ప్రస్తుతం అనేక అంతర్జాతీయ టెక్ కంపెనీలకు నేతృత్వం వహిస్తోంది భారతీయులు లేదా భారతీయ సంతతికి చెందిన వారే! గూగుల్,మైక్రోసాఫ్ట్,ఐబీఎమ్,అడోబీ,వీఎమ్వేర్, వంటి సంస్థలకు ఇండియన్లు నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు