6 లక్షలకుపైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు
- November 30, 2021న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం నాడు తెలిపారు.లోకసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.విదేశాంగ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 1.33 కోట్లకు పైగా భారతీయులు విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు.ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. 2017లో 1,33,049 తమ భారత పౌరసత్వాన్ని ఒదులుకోగా..2018లో 1,34,561.. 2019లో 1,44,017.. 2020లో 85,248 తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 1,11,287 మంది ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే..విదేశాల్లో భారత సంతతి వారు తమ తమ రంగాల్లో విజయం కేతనం ఎగరేస్తున్నారు.ప్రస్తుతం అనేక అంతర్జాతీయ టెక్ కంపెనీలకు నేతృత్వం వహిస్తోంది భారతీయులు లేదా భారతీయ సంతతికి చెందిన వారే! గూగుల్,మైక్రోసాఫ్ట్,ఐబీఎమ్,అడోబీ,వీఎమ్వేర్, వంటి సంస్థలకు ఇండియన్లు నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన