వీకెండ్ మీ ఇష్టం.. ప్రైవేట్ కంపెనీలకు వెసులుబాటు
- December 08, 2021
యూఏఈ: ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు తమకు నచ్చిన వీకెండ్ ను ఎంచుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. దీంతో కంపెనీలు, ఉద్యోగుల మధ్య పోటీ తత్వం పెరుగుతుందని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగున్నర రోజుల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేట్ సెక్టర్ కు సైతం వర్కింగ్ అవర్స్ ని ఎంచుకునే స్వేచ్ఛను యూఏఈ కల్పించింది. శనివారం, ఆదివారంతోపాటు శుక్రవారం సగం దినం మాత్రమే పనిదినాలను యూఏఈ కొత్తగా ప్రకటించింది. కొత్త వీకెండ్ విధానానికి అనుగుణంగా యూఏఈ సెంట్రల్ బ్యాంకు ఇకపై నాలుగున్నర రోజులు మాత్రమే పనిచేస్తుందని ప్రకటించింది. పబ్లిక్ సెక్టార్ లో తక్కువ పనిగంటలు (36 గంటలు) ప్రవేశ పెట్టిన మొదటి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించింది. యూఏఈ హెచ్ఆర్ అండ్ ఎమిరేటైజేషన్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ అవార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం వీకెండ్ ను ఎంచుకునే వెసులుబాటును ఇచ్చామని చెప్పారు. వీకెండ్ మార్పు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లకు మరింత ఊపు వస్తుందని, యూఏఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







