ఎయిర్ ఇండియా వన్ విమానాయాన సంస్థ సిబ్బంది డ్రస్కోడ్ను మార్చనుంది..
- March 23, 2016
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీల అధికారిక విమానం ఎయిర్ ఇండియా వన్ విమానాయాన సంస్థ తన సిబ్బంది డ్రస్కోడ్ను మార్చనుంది. దేశీయ, ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే సిబ్బందికి అవసరమైన ఖాదీ వస్త్రాలకు సంబంధించిన ఆర్డరును ఇచ్చినట్లు సమాచారం. మహిళా సిబ్బందికి సిల్కు చీరలు, పురుషులకు జోధ్పురి బంద్గల కోట్లు, జాకెట్లు అన్నింటినీ ఖాదీ వస్త్రాలతో రూపొందించమని ఆర్డర్ ఇచ్చారు. ఎయిర్ఇండియా సిబ్బందికి ఖాదీ వస్త్రాలను పరిచయం చేయడంతో పాటు. ముఖ్యంగా యువతకు ఖాదీ వస్త్రాలపై అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను వచ్చే వారంలో విడుదల చేయనున్నారు. మన్కీ బాత్ కార్యక్రమంలో మహాత్మగాంధీకి నివాళిగా ఖాదీ ఉత్పత్తుల వినియోగం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో మాట్లాడిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







