ఎయిర్‌ ఇండియా వన్‌ విమానాయాన సంస్థ సిబ్బంది డ్రస్‌కోడ్‌ను మార్చనుంది..

- March 23, 2016 , by Maagulf
ఎయిర్‌ ఇండియా వన్‌ విమానాయాన సంస్థ  సిబ్బంది డ్రస్‌కోడ్‌ను మార్చనుంది..

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీల అధికారిక విమానం ఎయిర్‌ ఇండియా వన్‌ విమానాయాన సంస్థ తన సిబ్బంది డ్రస్‌కోడ్‌ను మార్చనుంది. దేశీయ, ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే సిబ్బందికి అవసరమైన ఖాదీ వస్త్రాలకు సంబంధించిన ఆర్డరును ఇచ్చినట్లు సమాచారం. మహిళా సిబ్బందికి సిల్కు చీరలు, పురుషులకు జోధ్‌పురి బంద్‌గల కోట్లు, జాకెట్లు అన్నింటినీ ఖాదీ వస్త్రాలతో రూపొందించమని ఆర్డర్‌ ఇచ్చారు. ఎయిర్‌ఇండియా సిబ్బందికి ఖాదీ వస్త్రాలను పరిచయం చేయడంతో పాటు. ముఖ్యంగా యువతకు ఖాదీ వస్త్రాలపై అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ వెల్లడించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను వచ్చే వారంలో విడుదల చేయనున్నారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మహాత్మగాంధీకి నివాళిగా ఖాదీ ఉత్పత్తుల వినియోగం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో మాట్లాడిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com