భారత్లో కరోనా కేసుల వివరాలు
- December 10, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో రోజువారి కరోనా కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఓ రోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య తగ్గింది పెరిగింది. గడిచిన 24 గంటల్లో 12,93,412 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 8,503 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,74,744కి చేరింది. నిన్న ఒక్క రోజే 624 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,74,735 కి చేరింది.
నిన్న7,678 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,41,05,066కి చేరింది. ప్రస్తుతం దేశంలో 94,943 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 74.5 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 131.18 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







