సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటనతో సంబంధాలు మరింత బలోపేతం: కింగ్ హమాద్
- December 11, 2021
ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, బహ్రెయిన్ పర్యటన ముగించుకున్నారు. ఈ పర్యటనలో నిర్వహించిన పలు భేటీల ద్వారా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా కీలక చర్చలు జరిగాయి. గల్ఫ్ ఐక్యత, వ్యాపార సంబంధాల పెంపు వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ పర్యటన తనకు చాలా ఆనందాన్నిచ్చిందని క్రౌన్ ప్రిన్స్ ట్వీట్ చేశారు. కాగా, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా (క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్), ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్కి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కింగ్ మాట్లాడుతూ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు పడతాయని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







