సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటనతో సంబంధాలు మరింత బలోపేతం: కింగ్ హమాద్
- December 11, 2021
ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, బహ్రెయిన్ పర్యటన ముగించుకున్నారు. ఈ పర్యటనలో నిర్వహించిన పలు భేటీల ద్వారా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా కీలక చర్చలు జరిగాయి. గల్ఫ్ ఐక్యత, వ్యాపార సంబంధాల పెంపు వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ పర్యటన తనకు చాలా ఆనందాన్నిచ్చిందని క్రౌన్ ప్రిన్స్ ట్వీట్ చేశారు. కాగా, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా (క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్), ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్కి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కింగ్ మాట్లాడుతూ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు పడతాయని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్









