మహిళల కనీస వివాహ వయస్సు పెంపు ప్రతిపాదనకు ఆమోదం
- December 16, 2021
న్యూఢిల్లీ : మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 ఏళ్లకు పెంచుతూ చేసిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
బుధవారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన సమీక్షలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంవత్సరం తర్వాత ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. బుధవారం గత ఏడాది స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన మోడీ.. ఈ ప్రతిపాదన గురించి ప్రస్తావించారు.
' మా ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణులు ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెందుతోంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న కుమార్తెలను రక్షించేందుకు.. వారికి సరైన సమయంలో వివాహం చేయడం అవసరం భావిస్తున్నాం' అని మోడీ అన్నారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
నీతి ఆయోగ్లో జయ జైట్లీ నేతఅత్వంలోని టాస్క్ఫోర్స్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ విధమైన సవరణలను కేంద్రం తీసుకురానుంది. గతేడాది జూన్లో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ.. ఆరు నెలల్లోనే నివేదిక సమర్పించింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి 21 ఏళ్లు ఉండాలని టాస్క్ఫోర్స్ కీలక సూచన చేసింది. ఈ మేరకు ఓ నివేదికను నీతి అయోగ్ కేంద్రానికి అందించగా.. దీన్ని పరిశీలించిన మంత్రి వర్గం.. ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!









