దుబాయ్ ఎక్స్ పో వెళ్లేవారి కోసం అజ్మాన్ నుంచి ఫ్రీ గా 5 కొత్త బస్సులు
- December 21, 2021
దుబాయ్: క్రిస్ మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో ఎక్స్ పో 2020 దుబాయ్కి వచ్చే టూరిస్టుల కోసం మరిన్ని ట్రాన్స్ పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (APTA) అజ్మాన్ నగరంలోని ప్రధాన స్టేషన్ నుండి ఎక్స్ పో 2020 దుబాయ్కి వచ్చే సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో 5 బస్సు సర్వీసులను ప్రారంభించింది. లగ్జరీగా ఉండే ఈ బస్సుల్లో హై స్టాండర్డ్స్ సేప్టీ ప్రమాణాలు ఉన్నాయని APTA పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అండ్ లైసెన్సింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్ సమీ అలీ అల్ జల్లాఫ్ తెలిపారు. ఎక్స్ పో 2020 దుబాయ్ ని సందర్శించేందుకు వచ్చే వారికి మెరుగైన ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









