దుబాయ్ ఎక్స్ పో వెళ్లేవారి కోసం అజ్మాన్ నుంచి ఫ్రీ గా 5 కొత్త బస్సులు

- December 21, 2021 , by Maagulf
దుబాయ్ ఎక్స్ పో వెళ్లేవారి కోసం అజ్మాన్ నుంచి ఫ్రీ గా 5 కొత్త బస్సులు

దుబాయ్: క్రిస్ మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో ఎక్స్ పో 2020 దుబాయ్‌కి వచ్చే టూరిస్టుల కోసం మరిన్ని ట్రాన్స్ పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (APTA) అజ్మాన్ నగరంలోని ప్రధాన స్టేషన్ నుండి ఎక్స్ పో 2020 దుబాయ్‌కి వచ్చే సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో 5 బస్సు సర్వీసులను ప్రారంభించింది. లగ్జరీగా ఉండే ఈ బస్సుల్లో హై స్టాండర్డ్స్ సేప్టీ ప్రమాణాలు ఉన్నాయని APTA పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అండ్ లైసెన్సింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్ సమీ అలీ అల్ జల్లాఫ్ తెలిపారు. ఎక్స్ పో 2020 దుబాయ్ ని సందర్శించేందుకు వచ్చే వారికి మెరుగైన ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com