భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు..

- December 21, 2021 , by Maagulf
భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు..

న్యూ ఢిల్లీ: భారత్‌లో మొన్నటి వరకు కరోనా డెల్లా వేరియంట్‌తోనే కొట్టుమిట్టాడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌తో భయాందోళన గురవుతున్నాయి. ఈ వేరియంట్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇటీవల భారత్‌లోకి కూడా ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 173కు చేరుకుంది.

ఢిల్లీలో 6, గుజరాత్‌ 1, కేరళలో 4 చొప్పున గడిచిన 24 గంటల్లో 11 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్‌ కేసులు ఉండగా, ఢిల్లీలో 28, తెలంగాణలో 20, కర్నాటకలో 19, గుజరాత్‌లో 14, రాజస్థాన్‌లో 17, కేరళలో 15, యూపీలో 2లుగా ఉన్నాయి. అయితే ఛత్తీస్‌గడ్‌, బెంగాల్, తమిళనాడులో ఒక్కో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com