కరోనా నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లు, కేఫ్లపై చర్యలు
- December 25, 2021
బహ్రెయిన్: ఎల్లో అలర్ట్ లెవల్ ముందస్తు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించిన రెస్టారెంట్లు,కేఫ్లపై పరిశ్రమ, వాణిజ్యం,పర్యాటక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది.నిబంధనలు పాటించని ఒక రెస్టారెంట్ను మూసివేసింది. అంతర్గత మంత్రిత్వ శాఖ,హెల్త్ మినిస్ట్రీ, బహ్రెయిన్ ఎగ్జిబిషన్ అండ్ టూరిజం అథారిటీ (BTEA) సహకారం, సమన్వయంతో నిన్న క్యాపిటల్ గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించింది. ఈ ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లలో భాగంగా హెల్త్ ప్రోటోకాల్లను ఉల్లంఘించిన 28 రెస్టారెంట్లు,కేఫ్లకు నోటీసులు అందజేశారు.ఇదే సమయంలో 23 సెలూన్లను తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా లేని ఇద్దరు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని, నిబంధనలు పాటించని వాటి సమాచారాన్ని తెలపాలని పరిశ్రమల మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







