తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు...
- December 27, 2021
హైదరాబాద్: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.12 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు.కొత్త సంవత్సరం వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించారు.జనవరి 2వ తేదీ వరకు బహిరంగ సభలకు,ర్యాలీలకు ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తూ ఇప్పటి కే జీవోను విడుదల చేసింది.
ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.దక్షిణాదిన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.నైట్ కర్ఫ్యూను అమలు చేసే ఆలోచన లేదని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







