తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు...
- December 27, 2021
హైదరాబాద్: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.12 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు.కొత్త సంవత్సరం వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించారు.జనవరి 2వ తేదీ వరకు బహిరంగ సభలకు,ర్యాలీలకు ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తూ ఇప్పటి కే జీవోను విడుదల చేసింది.
ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.దక్షిణాదిన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.నైట్ కర్ఫ్యూను అమలు చేసే ఆలోచన లేదని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!