తెలంగాణలో భారీగా పెరిగిన కొత్త కేసులు..
- January 05, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది.రోజువారీ కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవ్వడం రాష్ట్రంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా గడిచిన 24 గంటల్లో 42, 531 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1520 మందికి పాజిటివ్గా తేలింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,85, 543కి చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4, 034కు చేరింది. గడిచిన 24 గంటల్లో 209 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6168 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఒమిక్రాన్ కేసుల వివరాలు..
కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదుకాలేదని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 13652 మంది ప్రయాణికులకు రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొవిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.వారిలో 207 మందికి కరోనా సోకిందని నిర్ధారితమైంది. ఇక ఒమిక్రాన్ నిర్ధారిత పరీక్షల కోసం వీటిని జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కి పంపగా.. వారిలో 162 మందికి ఒమిక్రాన్ సోకిందని తేలింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్ బాధితుల్లో 43 మంది కోలుకున్నారు. కాగా మరో 68మంది ఫలితాలు రావాల్సి ఉందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









